Tuesday, June 3, 2025
E-PAPER
Homeజిల్లాలుపోరాడి గెలిచిన అంగన్వాడీలకు జేజేలు: సీఐటీయూ

పోరాడి గెలిచిన అంగన్వాడీలకు జేజేలు: సీఐటీయూ

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచుతూ జీవో నెంబర్ 8 ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని, విఆర్ఎస్, పెన్షన్ సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సిఐటియు జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం  సిఐటియు జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. ఈ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీల ప్రకారం 2024 జులై 1 నుండి రిటైర్మెంట్ అయిన అంగన్వాడీ ఉద్యోగులందరికీ వర్తింప చేయాలనీ కోరుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు లక్ష నుండి 2 లక్షలకు, హెల్పర్స్ కు 50 వేల నుండి లక్షకు పెంచుతూ, 60 సంవత్సరాలు దాటిన వారికి వాలంటరీ రిటైర్మెంట్ ను నిర్ణయం చేస్తూ, పెన్షన్ సౌకర్యం కల్పిస్తూ శనివారం జీవో నెంబర్ 8 నీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇది తెలంగాణ రాష్ట్రంలో సిఐటియు సంఘం ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ సుదీర్ఘకాలం నిర్వహించిన పోరాటాల ఫలితం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని 2023 సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో 24 రోజులు నిరవధిక సమ్మె చేశాము. 2024 ఏప్రిల్ నుండి జూలై వరకు ఇదే డిమాండ్ పైన నిరంతరం రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు నిర్వహించాము. అన్ని జిల్లాల్లో రిలే నిరాహార దీక్షలు చేశాము. కలెక్టర్ ఆఫీస్ ల ముందు ధర్నాలు,ఎమ్మెల్యేలకు, మంత్రులకు వినతి పత్రాలు అందజేశాము. వికారాబాద్ జిల్లా కొడంగల్ లో ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి చేశాము. ఈ పోరాటాల ఫలితంగా ఐసిడిఎస్ మంత్రి సీతక్క అంగన్వాడీలకు హామీ ఇచ్చారు. కొత్త జీవో వస్తుందని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచి మాకు చెల్లిస్తారని వేయి కళ్ళతో వీళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో పెంచిన బెనిఫిట్స్ వీరికి చెల్లించకపోవడం అత్యంత అన్యాయం. వయసు పైబడ్డ వారిని ఈ విధంగా ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదు. 10 వేల మందికి నష్టం కలిగించే ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలి. జీవో నెంబర్ 8 ని సవరించాలి.ఈ జీవో లో పొందుపరిచిన అంశాలను 2024 జులై 1 నుండి రిటైర్మెంట్ అయిన వాళ్ళందరికీ వర్తింప చేస్తామని జి వో లో సవరించాలి. ఈ విధంగా జీవో నెంబర్8 ని సవరించి రిటైర్మెంట్ అయిన 10 వేల మంది అంగన్వాడీ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి స్వర్ణ, వాణి, జరీనా, సునీత, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -