- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ,టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గార్ల నేతృత్వంలో కొనసాగుతున్న జనహిత పాదయాత్రలో భాగంగా ఆదివారం జగిత్యాల జిల్లా ఆర్మూర్ మండలం ఆలూరు గ్రామంలో ఉదయం 6 గంటలకు నిర్వహించిన ప్రభాత్ ఫెరీ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. అనంతరం ఆలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసరాలను శుభ్రం చేసి,మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగించారు.
- Advertisement -