- Advertisement -
నవతెలంగాణ- జుక్కల్
వజ్రకండి గ్రామంలో రెండు రోజుల క్రితం ప్రకాష్ పటేల్ గుండెపోటుతో మరణించారు. ఆ కుటుంబాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదివారం పరామర్శించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాధితుడు ప్రకాష్ పటేల్ ఆకస్మాత్తుగా మరణించడం కుటుంబానికి తీరని లోటు అని అన్నారు. ప్రకాష్ పటేల్ కు చిన్న పిల్లలు ఉన్నారని, ఆ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



