- Advertisement -
నవతెలంగాణ – దుబ్బాక
ఈనెల 25 నుంచి 28 వరకు నిజామాబాద్ జిల్లా ముప్కాల్ లో జరిగే 35 వ సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు దుబ్బాక మండలం హబ్సిపూర్ లోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల బాలుర పాఠశాల పదో తరగతి విద్యార్థులు జీ. కిరణ్, బీ. భవదీష్ లు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ గోపాల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పీఈటీ తరుణ్ రాజ్, విద్యార్థులు కిరణ్, భవదీష్ లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ సత్తా చాటి దుబ్బాక ప్రాంతానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.
- Advertisement -