నవతెలంగాణ-పాలకుర్త
శ్రీసోమేశ్వర లక్ష్మీన ర్సింహస్వామి ఆలయంలో కార్తీక మాస ఉత్సవాల్లో భాగంగా తొలి సోమవారం కార్తీక దీపోత్సవం వైభవంగా నిర్వహిం చారు. కార్తీకమాస ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ అధికారులు నిర్వహించిన దీపోత్సవ కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దీపోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఆలయం ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శివలింగం ఆకారంలో మహిళలు దీపోత్సవ కార్యక్రమం సందర్భంగా దీపాలను వెలిగించారు. దీపోత్సవ కార్యక్రమానికి హాజరైన మహిళలకు ఆలయ అధికారులు తాంబూలం, ప్రసాదం వాయినంగా అర్చకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ సల్వాది మోహన్ బాబు, సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, ఆలయ ప్రధాన అర్చకులు దేవగిరి లక్ష్మన్న, డీవీఆర్ శర్మ, దేవగిరి అనిల్ కుమార్, మత్తగజం నాగరాజు, సిబ్బంది,భక్తులు పాల్గొన్నారు.
శ్రీసోమేశ్వరాలయంలో కార్తీక దీపోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


