- Advertisement -
నవతెలంగాణ-పాలకుర్తి
కార్తీక మాస ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం శ్రీ సోమేశ్వర లక్ష్మీన ర్సింహస్వామి ఆలయంలో కార్తిక దీపోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. దీపోత్సవంలో పాల్గొన్న మహిళలకు తాంబూలం, ప్రసాదం వాయినంగా అర్చకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ సల్వాది మోహన్ బాబు, సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, ఆలయ ప్రధాన అర్చకులు దేవగిరి లక్ష్మన్న, డీవీఆర్ శర్మ, దేవగిరి అనిల్ కుమార్, మత్తగజం నాగరాజు, సిబ్బంది ముంజ రాములు,భక్తులు పాల్గొన్నారు.
- Advertisement -



