- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ లో బీఆర్ కే భవన్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామైంది. ప్రయాణీకులు, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాన్ని చూసుకోవాలని పోలీసులు తెలిపారు. బీఆర్ కే భవన్లో కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయనకు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. దీంతో బీఆర్ కే భవన్, ట్యాంక్ బండ్, తదితర పరిసరాల్లో ట్రాఫిక్ జాం కావడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో ప్రయాణికులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో ఉన్నా.. ఆ వెహికిల్స్ ను చూస్తుంటే అంత త్వరగా కాదేమో అని అనిపిస్తోంది.
- Advertisement -