Saturday, November 1, 2025
E-PAPER
Homeకరీంనగర్పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

- Advertisement -

తంగళ్ళపల్లిలో డ్రైడే 
నవతెలంగాణ – తంగళ్ళపల్లి 

చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీ ఓ మీర్జా ప్రజలకు సూచించారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో శుక్రవారం డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ఓ, ఏఎన్ఎం తో పాటు గ్రామస్థాయి అధికారులు గ్రామంలో ఇంటింటా తిరుగుతూ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీవో మాట్లాడుతూ..ప్రజలు తమ ఇళ్ల పరిసరాలలో, ట్యాంకులలో, ఇతర పాత్రలలో నిల్వ ఉన్న నీటిని తొలగించి, దోమలు వృద్ధి చెందకుండా పరిసరాలను శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం జ్యోతి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -