Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుఇవాళ అర్ధరాత్రి వ‌ర‌కే ‘ఖైరతాబాద్ గ‌ణేష్ ద‌ర్శ‌నం’

ఇవాళ అర్ధరాత్రి వ‌ర‌కే ‘ఖైరతాబాద్ గ‌ణేష్ ద‌ర్శ‌నం’

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: గ‌ణేష్ న‌వ‌రాత్రి ఉత్స‌వాలు రెండు రోజుల్లో ముగియ‌నున్నాయి. హైద‌రాబాద్‌లోని ఖైరతాబాద్ మహా గ‌ణ‌నాథుని ద‌ర్శ‌నం కోసం ప‌లు రోజుల నుంచి గ‌ణేష్ భ‌క్తులు పొటెత్తున్నారు. తాజాగా ఖైరతాబాద్‌ మహా వినాయకుడి దర్శనానికి గురువారం అర్ధరాత్రి వరకే అనుమతి ఉంటుందని, ఆ తర్వాత భక్తుల దర్శనాలను నిలిపివేస్తామని నిర్వాహకులు తెలిపారు. శనివారం మహా వినాయకుడి నిమజ్జనం సందర్భంగా షెడ్డు తొలగింపు పనులు, క్రేన్‌ ఏర్పాట్ల కారణంగా శీఘ్ర, సర్వదర్శనాలకు అవకాశం ఉండదు. భక్తులు ఈ విషయాన్ని గమనించి నిర్వాహకులకు, పోలీసులకు సహకరించాలని కోరారు.

జీహెచ్‌ఎంసీలోని ఆరు జోన్ల పరిధిలో మంగళవారం వరకు 1,04,135 విగ్రహాల నిమజ్జనం జరిగినట్లు జీహెచ్‌ఎంసీ తెలిపింది. ఆయా ప్రాంతాల్లోని పెద్ద చెరువులతోపాటు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కొలనుల్లో ఈ నిమజ్జనాలు జరిగాయి. వీటిలో చిన్న, పెద్ద విగ్రహాలు కూడా ఉన్నాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad