అగ్రకథానాయకుడు చిరంజీవి కెరీర్లో సక్సెస్పరంగా, జోనర్ పరంగా ‘కొదమసింహం’ చాలా ప్రత్యేకమైన సినిమా. చిరంజీవి నటించిన ఒకే ఒక కౌబారు సినిమా ఇది. 1990, ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సాధించిన ఈ సినిమాను రీ రిలీజ్కు రెడీ చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. నవంబర్ 21వ తేదీన ఈ చిత్రాన్ని 4కే కన్వర్షన్, 5.1 డిజిటల్ సౌండింగ్తో సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. విజయదశమి పర్వదినం సందర్భంగా రమా ఫిలింస్ అధినేత కైకాల నాగేశ్వర రావు ఈ ప్రకటన చేశారు. చిరంజీవి కౌబారుగా నటించి ప్రేక్షకుల్ని అలరించిన ‘కొదమసింహం’ సినిమాలో రాజ్ కోటి మ్యూజిక్, మోహన్ బాబు కామెడీ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచాయి. కె. మురళీమోహన రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాధ, సోనం, వాణీ విశ్వనాథ్ హీరోయిన్స్గా నటించారు. ప్రేక్షకుల్ని మరోసారి ఎంటర్టైన్ చేసేందుకు మేకర్స్ ఈ చిత్రాన్ని సరికొత్తగా ముస్తాబు చేసి రిలీజ్ చేస్తున్నారు.