- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి 118వ జయంతి సందర్భంగా బుధవారం హైదరాబాద్లోని మఖ్దూంభవన్లో ఆయన చిత్రపటానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్యోతి, ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేతరాజు ఉప్పలయ్య, ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రి శ్రీమాన్, సీపీఐ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి గోవిందు, నాయకులు బోయ శ్రీరాములు, అంజయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -