- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచర్లలోని సాయివాణి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తుగా గురువారం శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో వారు చెసిన నృత్యాలు, ఆటపాటలు పలువురిని అలరించాయని పాఠశాల కరస్పాండెంట్ విరమనేని సంపత్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -