Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుమాగంటి గోపినాథ్ మరణం పట్ల కేటీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి

మాగంటి గోపినాథ్ మరణం పట్ల కేటీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నాయకుడు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మాగంటి గోపినాథ్ మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం తీవ్రంగా కలచివేసిందన్నారు. గోపీనాథ్‌ను కోల్పోవడం బీఆర్‌ఎస్‌కు తీరని లోటని చెప్పారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి మాగంటి గోపినాథ్ చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. మాగంటి గోపినాథ్ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
గత గురువారం తీవ్ర అస్వస్థతకు గురైన జూబ్లీహిల్స్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ కన్నుమూశారు. గచ్చిబౌలి ఏఐజీ దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం ఉదయం 5.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad