నవతెలంగాణ హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అంత ఈజీగా తీసుకోవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదన్న కేటీఆర్.. మాగంటి గోపీనాథ్ అకాల మరణం చాలా బాధాకరం. అనుకోకుండా వచ్చిన ఈ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో క్లాస్, మాస్ అందరూ ఉంటారని గుర్తచేశారు.
పేద వారికి మాత్రమే హైడ్రా నిబంధనలు వర్తిస్తాయా? అని ప్రశ్నించారు. సన్న బియ్యంతో విద్యార్థులకు అన్నం పెట్టింది కేసీఆర్ ప్రభుత్వమే అని చెప్పిన కేటీఆర్… తెలంగాణలో మతం పేరుతో కేసీఆర్ రాజకీయం చేయలేదని తెలిపారు. 20 నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క మంచి పని కూడా చేయలేదన్నారు. నూరు రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు.