కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్బాబు
నవతెలంగాణ-సూర్యాపేట
కులవివక్ష అంటరానితనాన్ని రూపుమాపడానికి, సామాజిక న్యాయ సాధన కోసం భవిష్యత్తు సామాజిక ఉద్యమాల నిర్మాణం కోసం సుశక్తులైన కార్యకర్తలుగా తీర్చిదిద్దడానికి జులై 12,13,14వ తేదీల్లో సూర్యాపేటలో మూడు రోజులపాటు నిర్వహించనున్న కేవీపీఎస్ రాష్ట్రస్థాయి సామాజిక శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక టీఎస్యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి కోట గోపి అధ్యక్షతన జరిగిన శిక్షణా తరగతుల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో బీజేపీ 11 ఏండ్ల పరిపాలన విధానం దళితుల జీవితాన్ని మరింత దుర్భరంలోకి నెట్టేసిందన్నారు. 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నామని ప్రధానమంత్రి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని చెప్పారు. దేశంలో దారిద్య్రం పెరుగుతుందని, మరోవైపున అదానీ, అంబానీ ఆస్తులు ఆకాశం ఎత్తుకు పెరుగుతున్నాయని అన్నారు. భారత రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి బీజేపీ కుట్రలు, కుతంత్రాలు చేస్తుందన్నారు. ఆర్ఎస్ఎస్ మనువాద ఎజెండాను అమలు చేయడం ద్వారా దేశంలో మతవిధ్వేషాలను రెచ్చగొడుతుందన్నారు. ఇటీవల కాలంలో దళితులపై 300 రెట్లు దాడులు, దౌర్జన్యాలు పెరిగాయని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై మూక దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుపరం చేయడం ద్వారా రిజర్వేషన్లకు మంగళం పాడుతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఏడాదికిపైగా గడిచినప్పటికీ దళితులకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం అమలుకు నోచు కోలేదన్నారు. రాజీవ్ యువవికాస పథకం, ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో కాంగ్రెస్ అనుయాయు లకే కట్టబెట్టే ప్రయత్నం జరుగు తుందని విమర్శిం చారు. అర్హులైన లబ్ది దారులను రాజకీయాల కతీతంగా ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిణి దళిత విద్యార్థినీ విద్యార్ధులను కించపరిచే విధంగా మాట్లాడారని, ఆమెను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఎంపిక చేయబడిన 300 మంది కేవీపీఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్న ఈ రాష్ట్రస్థాయి శిక్షణా తరగతుల్లో ఫూలే, అంబేద్కర్ ఆశయాలు కులసమస్య పరిష్కార మార్గాలు, దోపిడీ మూలాలు, మతోన్మాదం ప్రతిఘటనా పద్ధతులు వంటి అనేక అంశాలపై బోధించనున్నట్టు తెలిపారు.
ఈ తరగతుల జయ ప్రదానికి జిల్లాలోని అధికారులు, ప్రజా ప్రతినిధులు, శ్రేయోభిలాషులు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి, మాల మహానాడు జిల్లా నాయకులు, న్యాయవాది ఏడిండ్ల అశోక్, తెలంగాణ ప్రయివేట్ లెక్చరర్స్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి జె.నరసింహారావు, కేవీపీఎస్ జిల్లా నాయకులు తక్కెళ్ళపల్లి శ్యామ్, దుర్గారావు, ఇరుగు రమణ, జంగపల్లి శ్రీనివాస్, నందిపాటి శేఖర్, యాతకుల వెంకన్న, పడిశాల నాగరాజు, ములకలపల్లి మహేష్, విఘ్నేశ్వరీ, సైదమ్మ, నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.
12 నుంచి కేవీపీఎస్రాష్ట్ర స్థాయి సామాజిక శిక్షణా తరగతులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES