Wednesday, November 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగ్రామసభలు నిర్వహించిన తర్వాతే భూములు తీసుకోవాలి

గ్రామసభలు నిర్వహించిన తర్వాతే భూములు తీసుకోవాలి

- Advertisement -

– ఆర్డీఓ కార్యాలయం ఎదుట త్రిబుల్‌ ఆర్‌ బాధితుల ధర్నా
నవతెలంగాణ-చౌటుప్పల్‌ రూరల్‌

గ్రామసభలు నిర్వహించిన తర్వాతే తమ భూములను తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ యదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలకేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట త్రిబుల్‌ ఆర్‌ భూ బాధితులు ధర్నా నిర్వహించారు. మంగళవారం ఉదయమే పోలీసులకు ధర్నా సమాచారం అందడంతో చౌటుప్పల్‌ ఏసీపీ పటోళ్ల మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతులు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆర్డీవో బయటికి వచ్చి రైతులకు సమాధానం చెప్పాలని బాధితులు నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓ బయటికి వచ్చి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా త్రిబుల్‌ఆర్‌ బాధితుల సంఘం నాయకులు బూరుగు కృష్ణారెడ్డి, చింతల దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించకుండా రైతుల భూములు గుంజుకోవద్దని తెలిపారు. తమను సంప్రదించకుండా అధికారులు గానీ, పోలీసులుగానీ భూములపైకి వస్తే ఎంతకైనా తెగిస్తామని ఆర్డీవోను, పోలీసులకు స్పష్టం చేశారు. వెంటనే చౌటుప్పల్‌ మండలంలో భూములు కోల్పోతున్న రైతులతో కలెక్టర్‌తో సమావేశం ఏర్పాటుచేయాలని రైతులు ఆర్డీవో దృష్టికి తీసుకొచ్చారు. ఆర్డీఓ వెల్మ శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆరునెలల్లో మండలంలో భూములు కోల్పోతున్న రైతులతో గ్రామ సభలు నిర్వహించిన తర్వాతనే భూముల వద్దకు వస్తానని హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -