- Advertisement -
నవతెలంగాణ మద్నూర్ : మద్నూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కొండ విజయ్ విధులు మండల ప్రజలకు అభినందనీయమని, సాధించిన పథకాలు మండలానికి ఆదర్శంగా నిలుస్తాయని కాంగ్రెస్ సీనియర్ నాయకులు హనుమాన్లు స్వామి అన్నారు. కామారెడ్డి ఎస్పీ చేతుల మీదుగా రెండు పథకాలు అందుకున్న ఎస్సై విజయ్ కొండకు ఆదివారం కాంగ్రెస్ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో పాకాలవార్ రమేష్, కల్లూరువారు అశోక్, ఉష్కల్ వార్ శ్రీనివాస్, నాందేవ్ మేస్త్రి, మరికొందరు కలిసి శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
- Advertisement -