Sunday, June 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యే తోటను కలిసిన నాయకులు

ఎమ్మెల్యే తోటను కలిసిన నాయకులు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్: జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు కొన్ని రోజులుగా అనారోగ్యంతో హైదరాబాదులోని ఏఐజి ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్న విషయం తెలిసిందే. అయితే చికిత్సల అనంతరం ఎమ్మెల్యేను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్బంగా ఆయనను కలిసేందుకు మద్నూర్ మండల సలాబత్పూర్ ఆంజనేయస్వామి దేవాలయ ధర్మాదాయ శాఖ ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్, ఎమ్మెల్యేకు అత్యంత సన్నితుడైన సాయి పటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుటుంబ సభ్యులు రమేష్ ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమాన్లు స్వామి, కొండ గంగాధర్, కొండ రాజు, బండి దత్తు, కుమ్మరి సచిన్ ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఉన్నారు. అనంతంర ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వారు అడిగి తెలుసుకున్నారు. దీనికి ఎమ్మెల్యే ప్రతిస్పందిస్తూ.. తన ఆరోగ్యం పూర్తిగా కోలుకుందని తెలిపినట్లు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -