నవతెలంగాణ – హైదరాబాద్: ఇరాన్పై సామ్రాజ్యవాద అమెరికా చేసిన బాంబుదాడులను ఖండిస్తూ అఖిల భారత వామపక్ష పార్టీలు దేశ వ్యాపితంగా నిరసన కార్యక్రమాలను చేయాలని పిలుపునిచ్చాయి. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాపితంగా అన్ని జిల్లా కేంద్రాల్లో రేపు (జూన్ 24న) నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని తెలంగాణ వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. ఈ కార్యక్రమాల్లో ప్రజలు, ప్రజాతంత్రవాదులు, ప్రపంచ శాంతి కోరుకునే వారు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.
అంతర్జాతీయ చట్టాలను బేఖాతరు చేసి ఇరాన్ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేలా అమెరికా దాడులకు పాల్పడుతున్నది. ఇరాన్ అణ్వాయుదాలు తయారుచేస్తున్నాయనడానికి తమ వద్ద్ద ఎలాంటి ఆధారాలు లేవని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ మరియు అమెరికా ఇంటలీజెన్స్ సంస్థలు వెల్లడిరచినా కూడా, అణ్వాయుదాలు తయారు చేస్తున్నదనే నెపంతో ఇరాన్పై ఈ దాడికి అమెరికా పూనుకోవడం ఉద్రిక్తతలను రెచ్చగొట్టడమే. ఇరాన్ను ధ్వంసం చేయడం, పశ్చిమాసియాపై సామ్రాజ్యవాద ఆధిపత్యం చెలాయించడానికే అమెరికా ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నది. ఇది ప్రపంచశాంతికి భంగం కలిగించడంతో పాటు, పశ్చిమాసియాపై ఆధారపడుతున్న భారత్ వంటి దేశాలపై, కార్మికులపై, సాధారణ ప్రజల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతున్నది.
సామ్రాజ్యవాద అమెరికా దుశ్చర్యను భారత ప్రభుత్వం ఖండిరచాలని, అమెరికా` ఇజ్రాయిల్ అనుకూల విదేశాంగ విధాన వైఖరిని విడనాడి, యుద్ధాన్ని ఆపడంలో భాగస్వామి కావాలని వామపక్ష పార్టీల సమావేశం డిమాండ్ చేస్తున్నది. శాంతిని కోరుకునే వారంతా సామ్రాజ్యవాద అమెరికా దాడులను ఖండిరచాలని సమావేశం కోరుతున్నది.