– నేడు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఇరాన్పై సామ్రాజ్యవాద అమెరికా చేసిన బాంబుదాడులను అఖిల భారత వామపక్ష పార్టీలు ఖండించాయి. ఆ దాడులను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చాయి. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మంగళవారం నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని తెలంగాణ వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. ఈ కార్యక్రమాల్లో ప్రజలు, ప్రజాతంత్రవాదులు, ప్రపంచ శాంతి కోరుకునే వారు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశాయి. సోమవారం హైదరాబాద్లో వామపక్ష పార్టీల సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో జాన్వెస్లీ (సీపీఐ(ఎం)), కూనంనేని సాంబశివరావు (సీపీఐ), పి సూర్యం (సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ), పోటు రంగారావు (సీపీఐఎంఎల్ మాస్లైన్), గాదగోని రవి (ఎంసీపీఐయూ), ఎం రమేష్రాజా (సీపీఐఎంఎల్ లిబరేషన్), సిహెచ్ మురహరి (ఎస్యూసీఐసీ), జానకి రాములు (ఆరెస్పీ), బి సురేందర్రెడ్డి (ఫార్వర్డ్బ్లాక్), ప్రసాదన్న (సీపీఐ ఎంఎల్) తదితరులు పాల్గొన్నారు. అనంతరం సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు.
అంతర్జాతీయ చట్టాలను బేఖాతరు చేసి ఇరాన్ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేలా అమెరికా ఈ దాడులకు పాల్పడుతున్నదని విమర్శిం చారు. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తున్నాయనడానికి ఎలాంటి ఆధారాల్లేవంటూ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ, అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలు వెల్లడిరచినా అణ్వాయుధాలను తయారు చేస్తున్నదనే నెపంతో ఇరాన్పై దాడికి పూనుకోవడం ఉద్రిక్తతలను రెచ్చగొట్టడమేనని పేర్కొన్నారు. ఇరాన్ను ధ్వంసం చేయడం, పశ్చిమాసియాపై సామ్రాజ్యవాద ఆధిపత్యం చెలాయించడానికే అమెరికా ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నదని విమర్శించారు.
ఇది ప్రపంచశాంతికి భంగం కలిగించడంతో పాటు, పశ్చిమాసియాపై ఆధారపడుతున్న భారత్ వంటి దేశాలు, కార్మికులు, సాధారణ ప్రజల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని తెలిపారు. సామ్రాజ్యవాద అమెరికా దుశ్చర్యను భారత ప్రభుత్వం ఖండిరచాలనీ, అమెరికా-ఇజ్రాయిల్ అనుకూల విదేశాంగ విధాన వైఖరిని విడనాడి, యుద్ధాన్ని ఆపడంలో భాగస్వామి కావాలని వారు డిమాండ్ చేశారు. శాంతిని కోరుకునే వారంతా సామ్రాజ్యవాద అమెరికా దాడులను ఖండిరచాలని కోరారు.
ఇరాన్పై అమెరికా దాడులకు వామపక్షాల ఖండన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES