- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: నల్గొండ జిల్లా మునుగోడు మండలం చొల్లేడు గ్రామంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. ఊరి శివారులోని పత్తి చేను వద్ద చిరుత కనిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. పత్తి కోసే క్రమంలో కూలీలు చిరుతను చూసి భయపడ్డారు. ఒక కూలీ చిరుత సంచారాన్ని మొబైల్ లో చిత్రీకరించాడు. చిరుత సంచారంతో గ్రామస్తులు భయంతో గడుపుతున్నారు.
- Advertisement -



