- Advertisement -
– గ్రామ సర్పంచ్ మోతె యాదగిరి గౌడ్
నవతెలంగాణ – కామారెడ్డి, బిబిపేట్
కామారెడ్డి మండలంలోని గూడెం గ్రామంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా గ్రామపంచాయతీ వద్ద నిర్వహించిన వేడుకల సందర్భంగా గ్రామ సర్పంచ్ మోతె యాదగిరి గౌడ్ జాతీయ జెండా ను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామి కావాలని గ్రామస్తులు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కొండి అశోక్, కార్యదర్శి సంగీత, వార్డ్ మెంబర్లు ఆకుల చిన్న గంగాగౌడ్, చిందాల సుజాత, దాకాల ప్రియాంక, తెడ్డు బాలరాజ్, దంతేపల్లి రాధా,బండారి లక్ష్మీ, పరం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



