- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి : రైతు సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు కార్యాచరణ రూపొందించుకొని పోరాడాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షులు పైడి విట్టల్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులతో మండల అధ్యక్షులు నా రెడ్డి రాజిరెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రుణమాఫీ, విద్యుత్ సమస్యలు, సన్నాలకు బోనస్ వంటి సమస్యలపై చర్చించారు. కార్యక్రమంలో జిల్లా సభ్యులు కొడగండ్ల రాజశేఖర్, లింగం, మండల కమిటీ మెంబర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -