Tuesday, August 5, 2025
E-PAPER
Homeనిజామాబాద్పెన్షన్ల పెంపుకు పోరాడుదాం రండి 

పెన్షన్ల పెంపుకు పోరాడుదాం రండి 

- Advertisement -

– ఈనెల 5న కామారెడ్డికి మందకృష్ణ మాదిగ రాక 

– వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు వేలాదిగా తరలి రండి 

– వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కోల బాలరాజ్ గౌడ్
నవతెలంగాణ –  కామారెడ్డి

 వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో హక్కుల కోసం పోరాడేందుకు ఈనెల ఐదున కామారెడ్డి జిల్లా కేంద్రానికి టెన్షన్ దారులు అందరు తరలి రావాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కోల బాలరాజు గూడ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం  మధ్యాహ్నం ఒకటి గంటకు మందకృష్ణ మాదిగ  కామారెడ్డికి వస్తున్నారనీ,  వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు అందరూ ఈ సభకు తరలిరావాలన్నారు. ఈ సభ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని  లక్ష్మీదేవి గార్డెన్ దేవునిపల్లి రోడ్ లో పోయించడం జరుగుతుందన్నారు. సభా వేదికగా  4000 పెన్షన్ 6000 పెన్షన్,  రెండు వేల పెన్షన్ 4000 పెన్షన్ కోసం చేస్తున్నటువంటి ఈ పోరాటానికి వికలాంగుల సోదరులు, వృద్ధులు, వితంతువులు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -