తెలంగాణ రాష్ట్ర రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి బి.భాస్కర్
నవతెలంగాణ – కమ్మర్ పల్లి : అమరవీరుల స్ఫూర్తితో కార్మికుల హక్కుల కొరకు పోరాడుదామని కార్మికులోకానికి తెలంగాణ రాష్ట్ర రైతు కూలి సంఘం జిల్లా కార్యదర్శి బి.భాస్కర్ పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలోని భగత్ సింగ్ విగ్రహం వద్ద మేడేను పురస్కరించుకొని జెండాను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు అనేక పోరాటాలు చేసి సాధించుకున్న హక్కుల రోజు ఇది అన్నారు. బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతూ కార్మికులకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటూ కార్మిక లోకానికి తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. కార్మికులు సాధించుకున్న 44 చట్టాలను నాలుగు కోల్డ్ గా విభజించి కార్మికులకు పని లేకుండా చేయడానికి కుట్ర చేస్తున్నారన్నారు.139 సంవత్సరాల క్రితం సాధించుకున్న హక్కుల్ని ప్రభుత్వాలు మారుస్తూ వాళ్ల జీవితాలతోని సెలయేట మాడుతున్నారని ఆరోపించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి రావడం కోసం అనేక మోసపూరిత వాగ్దానాలు చేసిందన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని, నల్లధనం బయటకు తీసి ప్రతి ఒక్కరికి రూ.15 లక్షలు పంచుతానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాని,i అంబానీలకు సేవకుడిగా మారారని విమర్శించారు. పెట్టుబడుదారులకు ఉన్న అప్పులన్నిటిని రద్దు చేశారని, రైతాంగ అప్పుల్ని మాఫీ చేయడం మర్చిపోయారన్నారు. ఓడ దాటే దాకా ఓడ మల్లన్న.. ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న చందంగా మారారని విమర్శించారు. కాంట్రాక్టు విధానాన్ని రద్దుచేసి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలని దేశవ్యాప్తంగా కనీస వేతనం రూ.26వేలు, పెన్షన్ రూ.10వేలు అందరికీ చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు పెద్ద ఆశన్న, చిన్న భూమన్న, అల్తాఫ్, రాజ గంగారం, బాజా గౌడ్, ఖాదర్, నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల హక్కుల కొరకు పోరాడుదాం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES