- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఉన్న ఇద్దరు పిల్లల నిబంధన రద్దైంది. ఈ నిబంధనను ప్రభుత్వం ఇటీవల ఎత్తివేయగా.. ఆర్డినెన్స్కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. దీంతో ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉన్నా సర్పంచ్, వార్డ్ మెంబర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ వంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేసే అవకాశం లభించింది.
- Advertisement -



