Friday, June 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లయన్ ఇంటర్నేషనల్ రీజియన్ సమావేశం..

లయన్ ఇంటర్నేషనల్ రీజియన్ సమావేశం..

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్: లయన్ ఇంటర్నేషనల్ నిజామాబాద్ రీజియన్ చైర్మన్ లయన్ ఉదయ సూర్య భగవాన్ ఆధ్వర్యంలో అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారి సమావేశాన్ని నగరంలోని వంశీ ఇంటర్నేషనల్ హోటల్లో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రీజియన్ చైర్మన్ లయన్ ఉదయ సూర్య భగవాన్ మాట్లాడుతూ.. 2025-26 సంవత్సరంలో లయన్ సేవలను విస్తరింపజేయాలని విద్య వైద్యంపై అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచనలు చేశారు. లయన్ ఇంటర్నేషనల్ జిల్లా అదనపు క్యాబినెట్ ట్రెజరర్ లయన్ లక్ష్మీనారాయణ ముఖ్యఅతిథిగా విచ్చేసి పి ఎస్ టి ల బాధ్యతలను గుర్తించి ఇతర కార్యవర్గం సభ్యులతో మమేకమై విభిన్నంగా నూతన ఉరవడికతో సేవలను అందించాలని తెలిపారు. రీజియన్ వీఆర్వో లయన్ చింతల గంగాదాస్ పిఎస్టి లను ఉద్దేశించి వారు చేసిన సేవలు గుర్తిండిపోయేలా ఉండాలని వివరించారు. జోన్ చైర్మన్ లను లయన్ నరసింహారావు, లయన్ దారం భూమన్న, ఆవన్ పవన్ కుమార్, తదితరులు పాల్గొనగా రీజన్ కోఆర్డినేటర్ లయన్ నాగేశ్వరరావు వందన సమర్పణతో సమావేశాన్ని ముగించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -