సంగిశెట్టి శ్రీనివాస్కి ఎదిరెపల్లి మశమ్మ స్మారక జాతీయ పురస్కారం
ఎదిరెపల్లి మశమ్మ స్మారక జాతీయ పురస్కారానికి డా.సంగిశెట్టి శ్రీనివాస్ ఎంపికయ్యారు. ఈ నెల 21న ఉదయం 10గంటలకు నాగర్ కర్నూల్ జిల్లా సింగిల్ విండో హల్లో పురస్కారాన్ని అందజేస్తారు. ఈ సభకు డాక్టర్ గోరటి వెంకన్న, డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డి హజరవుతారు. కవులు, కళాకారులు, రచయితలు, విద్యార్థులందరికీ ఆహ్వానం. – ఎదిరెపల్లి కాశన్న, 9640006304
కలిమిశ్రీకి ఆచార్య రవ్వా శ్రీహరి స్మారక సాహితీ పురస్కారం
ఆచార్య రవ్వా శ్రీహరి స్మారక సాహితీ పురస్కారాన్ని కలిమిశ్రీకి అందజేస్తున్నట్టు ప్రకటించారు. ఈ అవార్డును డిసెంబరు 21న విజయవాడలో నిర్వహిస్తున్న ప్రత్యేక సాహితీ కార్యక్రమంలో అందజేస్తున్నట్టు నిర్వాహకులు తెలియజేశారు.
సాహితీ వార్తలు
- Advertisement -
- Advertisement -


