- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
హైటెక్ సిటీ హైదరాబాద్లో శనివారం నిర్వహించిన ఈటి టెక్ ఎక్స్ ( ET TECH X ) కార్యక్రమంలో తెలంగాణలోని కామారెడ్డి కి చెందిన లిటిల్ స్కాలర్స్ హై స్కూల్కు ఈటి టెక్ ఎక్స్ – ట్రైల్బ్లేజర్ స్కూల్ ఆఫ్ ది ఇయర్ 2025–26” అవార్డు లభించిందనీ పాఠశాల చైర్మన్ పున్న రాజేష్ తెలిపారు. ఇన్నోవేటివ్ టీచింగ్ పద్ధతులు, లైఫ్ స్కిల్స్ విద్య, అకాడమిక్ ఎక్సలెన్స్లో ప్రతిభ కనబర్చినందుకు, ఈ పాఠశాలను తెలంగాణ రాష్ట్రంలోని టాప్ 20 స్టేట్ బోర్డ్ పాఠశాలలలో ఒకటిగా ఎంపిక చేశారన్నారు. ఈ అవార్డును పాఠశాల తరఫున చైర్మన్ తో పాటు పాఠశాల డైరెక్టర్ పున్న పావని స్వీకరించారు.
- Advertisement -



