– డాక్టర్ వసంత్ కుమార్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
పాడి రైతులు తమ పశువులకు తప్పకుండా గాలికుంటు నివారణ టీకాలు వేయించాలని చౌట్ పల్లి పశువైద్యాధికారి డాక్టర్ వసంత్ కుమార్ అన్నారు. ప్రభుత్వం ఉచితంగా నిర్వహిస్తున్న ఈ గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సోమవారం మండలంలోని హస కొత్తూర్ గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని గోజాతి, గేదే జాతి పశువులకు ఉచితంగా గాలికుంటు నివారణ టీకాలు వేశారు. గాలు కుంటి వ్యాధి లక్షణాలు, నివారణపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ప్రతి పశువుకు తప్పకుండా గాలికుంటు నివారణ టీకా వేయించాలన్నారు.
ప్రతి ఆరు నెలలకు ఒకసారి గాలికుంటు నివారణ టీకాలు వేయించడం ద్వారా పాడి పశువులు ఆరోగ్యంగా ఉంటాయని తెలిపారు. జీవాలు గాలికుంటు వ్యాధి బారిన పడడం వల్ల పాల ఉత్పత్తి తగ్గిపోవడం, కాలి డెక్కలలో పగుళ్లు ఏర్పడి నడవలేకపోవడం, నోటిలో పుల్లతో చొంగ కారడం, చూడి పశువులకు అబార్షన్లు అవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. రైతులు ముందు జాగ్రత్త కొరకు తప్పకుండా తమ పశువులకు గాలికుంటు నివారణ టీకాలు చేయించుకోవాలని సూచించారు. రైతులకు పలు సలహాలు సూచనలు చేశారు. కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది స్పరన్, రైతులు సత్యం, పెద్ది మహిపాల్, క్రాంతి, శ్రీనివాస్, మనోజ్, నరేందర్, అరుణ్, లింబాద్రి, తదితరులు పాల్గొన్నారు.
పశువులకు తప్పకుండా టీకాలు వేయించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



