- Advertisement -
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి
నవతెలంగాణ – వనపర్తి
జిల్లాలో మూడు విడతలుగా జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ జరిగే రోజున ఆయా మండలాల్లో స్థానిక సెలవును ప్రకటిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి నేడొక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11, 14, 17 తేదీల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా ప్రాంతాల్లో ఈ సెలవులను ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. మొదటి విడతలో భాగంగా రేపు ఖిల్లా ఘనపురం, పెద్దమందడి, గోపాల్పేట, ఏదుల, రేవల్లి మండలాల్లో పోలింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయా మండలాల్లో స్థానిక సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
- Advertisement -


