- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
జాతీయస్థాయి విలువిద్య పోటీలకు డొంకేశ్వర్ మండలంలోని తొండాకూరు గ్రామానికి చెందిన ప్రముఖ జాతీయ స్థాయి క్రీడాకారుడు ఖేలో ఇండియా విలువిద్య శిక్షకుని కుమార్తె మద్దుల శ్రీనిక ఎంపికయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే 69వ జాతీయస్థాయి పోటీలకు అండర్ -17 విభాగంలో పాల్గొంటుంది. ఈ పోటీలు ఈనెల 6 నుంచి 10 వరకు జార్ఖండ్ రాష్ట్రంలో గల రాంచిలో జరగనున్నాయి. విలువిద్య శిక్షకులు మురళి సోమవారం తెలిపారు.
- Advertisement -



