- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు చాలా మంది దళ సభ్యులు సమావేశమయ్యారనే విశ్వసనీయ సమాచారం పోలీసు వర్గాలకు అందింది. ఈ మేరకు ఛత్తీస్గఢ్ లోకల్ పోలీసులు, సాయుధ దళం 7వ బెటాలియన్ సంయుక్తంగా జాయింట్ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలోనే ఇరు వర్గాలు ఎదురుపడగా.. భీకర ఎదురుకాల్పులు జరిగాయి. జరగిన ఎన్కౌంటర్లో ఓ మావోయిస్టు మృతిచెందాడు. కాల్పులు జరిగిన స్థలంలో మావోయిస్టులు వదిలి వెళ్లిన ఆటోమెటిక్ గన్స్తో పాటు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ ఎన్కౌంటర్కు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
- Advertisement -