- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: లుధియానా నుంచి ఢిల్లీకి వెళ్తున్న గరీబ్రథ్ రైలులో సిర్హింద్ స్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కోచ్ నెం.19లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ మహిళకు తీవ్ర గాయాలుయ్యాయి. మిగతా ప్రయాణికులు అప్రమత్తమై చైన్ లాగి కిందకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -