- Advertisement -
బీసీ సంఘాల జేఏసీ
నవతెలంగాణ – నెల్లికుదురు
రేపు బీసీ సంఘాల ఆధ్వర్యంలో బీసీ లకు 42% రిజర్వేషన్లు మరియు బీసీల హక్కుల సాధనకు నిర్వహించ తలపెట్టిన బందును విజయవంతం చేయగలరని పార్టీలు నేతలు ప్రజా సంఘాల నేతలు కోరినట్లు తెలిపారు. మండల కేంద్రంలో స్థానిక విశ్రాంతిభవనంలో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. బీసీ బంద్ ను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు యాసం రమేష్. పెరుమాండ్ల బాబూగౌడ్ ,వరిపల్లి ఉప్పలయ్య ,కుమ్మరికుంట్ల మౌనందర్ ,బొమ్మేర ఎల్లగౌడ్ ,సలుగు హనుమంతు, వీరగాని మల్లేశం గౌడ్, ప్రజా సంఘాల నాయకులు ఇస్సాంపల్లి సైదులు బిర్రు యాకయ్య MD సర్ధార్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -