- Advertisement -
- – కాటారం మండలంలో గోడ పత్రికల ఆవిష్కరణ
– సీపీఐ జిల్లా కార్య వర్గ సభ్యులు క్యాతరాజు సతీష్ - నవతెలంగాణ – మల్హర్ రావు(కాటారం)
- సీపీఐ 5వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని, కాటారం మండలంలోని కొత్తపల్లి గ్రామంలో శనివారం సీపీఐ నాయకులు వాల్ పోస్టర్లను(గోడ పత్రికలు) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సబ్యులు క్యాతరాజు సతీష్ మాట్లాడుతూ.. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతు 99 వసంతాలను పూర్తి చేసుకున్న భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ జిల్లా మహాసభలను ఈ నెల జులై 13, 14వ తేదీన రేగొండ ఎస్ ఎల్ ఎన్ గార్డెన్ లో లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఈ జిల్లా మహాసభకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాస్ రావు ముఖ్యఅతిథిలుగా హాజరవుతున్నారని తెలిపారు.
- మహాసభలో జిల్లా సమగ్ర అభివృద్ధికై చర్చించి భవిష్యత్ కార్యక్రమం రూపొందించుకోవడం జరుగుతుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన పెద్ద ఎత్తున చర్చ జరిపి తీర్మానాలు ప్రవేశపెట్టి ఆందోళన పోరాటాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. కాటారం మండల అభివృద్ధినీ పాలకులు పూర్తిగా విస్మరించడం జరిగిందన్నారు. కాటార మండల కేంద్రంలో సమస్యల పరిష్కారం కోసం ఈ మహాసభల్లో తీర్మానాన్ని ప్రవేశపెట్టి కాకర మండల సమగ్ర అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక రూపకల్పన చేసుకొని సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ మహాసభ ఉపయోగపడుతుందన్నారు. సీపీఐ 5వ జిల్లా మహాసభలను ప్రజలు, మేధావులు, కార్మికులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్య వర్గ సభ్యులు సోతుకు ప్రవీణ్ సిపిఐ మండల కార్యదర్శి చిట్యాల ప్రవీణ్, సీపీఐ జిల్లా సమితి సభ్యులు వేముల శ్రీకాంత్ నేరెళ్ల జోసెఫ్ తో పాటు సీపీఐ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -