ఎంఈఓ లక్ష్మన్ బాబు
నవతెలంగాణ – మల్హర్ రావు: మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రభుత్వ ఉన్నత జిల్లా పరిషత్ పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మండల ఎంఈఓ లక్ష్మన్ బాబు గురువారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు .2025-26 విద్యా సంవత్సరం మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న పాఠశాలల్లోని 6 నుంచి 10వతరగతి విద్యార్థులు ఈ వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు శిక్షణ ఉంటుందని తెలిపారు. శిక్షణ సిబిరంలోమ్యూజిక్, సాంగ్స్, పెయింటింగ్, డ్రాయింగ్, స్పోకెన్ ఇంగ్లీష్ తదితరవి శిక్షణ శిబిరంలో ఈనెల 26 నుంచి 28 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు.
శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES