- Advertisement -
నవతెలంగాణ – గాంధారి : గాంధారి మండలంలోని జువ్వాడి గ్రామానికి చెందిన చిన్నోళ్ల సాయిలు (40) తండ్రి పెద్ద పోచయ్య మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈరోజు ఆయన సొంత పొలంలో చెట్టుకు ఊరికి వేసుకొని మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. అతను వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు రెండు ఎకరాల పొలం ఉంది. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. మృతికి గల కారణాలు తెలియడం లేదని గ్రామస్తులు పేర్కొన్నారు .
- Advertisement -