- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: అవినీతి నిరోధక శాఖ (ఎసీబీ) విచారణకు ఆప్ నేత, మాజీ మంత్రి మనీష్ సిసోడియా గైర్హాజరయ్యారు. సిసోడియా సోమవారం విచారణకు హాజరుకాలేరని ఆయన న్యాయవాది తెలిపారని ఎసిబి వర్గాలు తెలిపాయి. మరోరోజు విచారణ కోసం సమన్లు పంపనున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. రూ.2,000 కోట్ల తరగతి గదుల కుంభకోణంలో జూన్ 6, 9 తేదీల్లో విచారణకు హాజరుకావాలంటూ ఆప్ నేతలు సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియాలకు ఎసిబి సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. జూన్ 6 (శుక్రవారం) సత్యేందర్ జైన్ విచారణకు హాజరయ్యారు. ఐదుగంటలకు పైగా ఎసీబీ ప్రశ్నించింది.
- Advertisement -