- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బాలికతో పెళ్లి, లైంగికదాడి కేసులో రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బాలిక భర్త, తండ్రికి జీవితఖైదు విధించింది. 2018లో హైదరాబాద్ సరూర్నగర్ పరిధిలో 17 ఏళ్ల బాలికకు బలవంతపు పెళ్లి చేశారు. ఈకేసులో బాలిక భర్త, తండ్రికి జీవిత ఖైదుతో పాటు, రూ.75 వేల చొప్పున కోర్టు జరిమానా విధించింది. బాధితురాలికి న్యాయమూర్తి రూ.15 లక్షల పరిహారం మంజూరు చేశారు.
- Advertisement -



