– ప్రజాస్వామ్య రిగ్గింగ్కు ఇది ఉదాహరణ
– బీహార్లో రిపీట్ అయ్యేదిదే..!
– బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు
– ఆయన వ్యాఖ్యలపై కాషాయపార్టీ ఆగ్రహం
న్యూఢిల్లీ: గతేడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాచ్ఫిక్సింగ్కు పాల్పడిందంటూ బీజేపీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్య రిగ్గింగ్కు ఆ ఎన్నికలు ఓ ఉదాహరణ అని పేర్కొన్నారు. బీహార్లోనూ ఇదే రిపీట్ అవుతుందని విమర్శించారు. మహారాష్ట్రలోని అధికార బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమిపై రాహుల్ గాంధీ చేసిన తీవ్ర విమర్శలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఆయన వ్యాఖ్యలపై కాషాయ పార్టీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఒక ఆంగ్ల వార్త పత్రికకు ఆయన రాసిన ఆర్టికల్ను పెడుతూ సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ప్రజాస్వామ్య రిగ్గింగ్కు 2024లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికలు ఒక బ్లూప్రింట్ అని పేర్కొన్నారు. ఇది ఎలా జరిగిందో తన ఆర్టి కల్లో సమగ్రంగా ఉన్నదని వివరించారు. ”ఎన్నికల కమిషన్ నియామకం, నకిలీ ఓటర్ల నమోదు, పోలింగ్లో అవకతవ కలు, ఆధారాలను దాయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. బీజేపీ ఎందుకు అలా ప్రవర్తించిందో అర్థం చేసుకోవడం పెద్దకష్టం కాదు. రిగ్గింగ్ అనేది మ్యాచ్ఫిక్సింగ్ లాంటిది. మోసం చేసే పార్టీ ఆటలో గెలవొచ్చు. కానీ అలాంటి గెలుపు వ్యవస్థలను దెబ్బతీస్తుంది. ఎన్నికల ఫలితాలపై ప్రజల విశ్వాసాన్ని నాశనం చేస్తుంది. ప్రజలంతా ఆధారాలను గమ నించి సమాధానాల కోసం డిమాండ్ చేయాలి. ఎందుకంటే మహారాష్ట్ర తర్వాత బీహార్ ఎన్నికలున్నాయి. ఆ తర్వాత బీజేపీకి ఓటమి భయం ఎక్కడుం టుందో అక్కడ ఇవే రిపీట్ అవుతాయి. మ్యాచ్ఫిక్సింగ్ ఎన్నికలు.. ప్రజాస్వామ్యానికి విషం లాంటివి” అంటూ రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన చేసిన ఈ ఆరోప ణలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఈసీ చాలాసార్లు వివరంగా చెప్పినా.. రాహుల్గాంధీ మళ్లీ దేశంలోని వ్యవస్థలను బూచిగా చూపే పనిలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర శాసన సభలో మొత్తం 288 సీట్లున్నాయి. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన (శిండే), ఎన్సీపీ(అజిత్ పవార్)ల కూటమి మహాయుతి 235 సీట్లు గెల్చుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ఒక్క కమలం పార్టీకే 132 స్థానాలు దక్కాయి. ఈ ఏడాది చివర్లో షెడ్యూల్ ప్రకారం బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. ఈ నేపథ్యంలో రాహుల్ తాజా వ్యాఖ్యలు రాజకీ యాన్ని తీవ్రంగా వేడేక్కించాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో మ్యాచ్ఫిక్సింగ్
- Advertisement -
- Advertisement -