Thursday, June 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి ..

వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి ..

- Advertisement -

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ 
నవతెలంగాణ – భూపాలపల్లి
: వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై వైద్యశాఖ  ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పంచాయతి రాజ్, డిఆర్డీఓ,  విద్యా, ఆర్ డబ్ల్యూఎస్, సంక్షేమ శాఖల అధికారులు, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో సీజనల్ వ్యాధులు నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలు,  జాగ్రత్తలను గురించి  వివరించారు. వ్యాధి ప్రబలిన తదుపరి చికిత్సలు చేయడం కంటే వ్యాధులు ప్రబల కుండా ముందస్తు చర్యలు చాలా ముఖ్యమని తెలిపారు. వానాకాలంలో మలేరియా, పైలేరియా, మెదడు వాపు, డెంగీ, చికెన్ గున్యా, టైఫాయిడ్, డయేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని తెలిపారు. ఎప్పటికప్పుడు అన్ని పరీక్షలు నిర్వహిస్తూ మెరుగైన వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశారు. పరసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో అన్ని వ్యాధులను అరికట్టవచ్చని వివరించారు. ఇందుకు గాను ప్రతి శుక్రవారం ప్రతి కుటుంబం తప్పని సరి డ్రై డే పాటించేలా అవగాహన కల్పించాలని సూచించారు. వర్షపు నీరు నిల్వ వల్ల దోమలు వ్యాప్తి జరుగుతుందని  ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు.

నీరు  నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి ఆయిల్ బాల్స్, గంభూషియా చేపలు వేసి దోమలు ప్రభల కుండా అరికట్టాలని తెలిపారు. దోమలు వ్యాప్తి జరుగకుండా ఫాగింగ్ చేయాలన్నారు. గ్రామ పంచాయతీ, మున్సిపల్ ప్రాంతాల్లో  మురుగునీరు నిల్వలు, వ్యర్థాలు  లేకుండా పరిశుభ్రం చేయాలని సూచించారు. పాఠశాలల్లో విద్యార్థులకు వ్యక్తి గత పరిశుభ్రత అలాగే వ్యాధులు ప్రబల కుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు, అంగన్వాడీ. కేంద్రాల చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యాధుల ప్రబలిన గ్రామాలల్లో వైద్య శిబిరాలు నిర్వహించి ఇంటింటి సర్వే చేసి వైద్య సేవలు అందించి వ్యాధులు ప్రభలకుండా  చర్యలు తీసుకోవాలని సూచించారు.  అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ర్యాపిడ్ టీములు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. సురక్షిత, మంచినీటి సరఫరా అత్యంత ముఖ్యమని ముందిగానే కుళాయిలు, మంచినీటి వైపు లైన్లు లీకేజీలు లేకుండా  చర్యలు తీసుకోవాలని ఆర్ డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. మంచినీటి ట్యాంకులు ప్రతి 10 రోజులకు ఒకసారి పరిశుభ్రం చేయాలని, మంచినీటిని క్లోరిన్ వేయాలని తెలిపారు. డిఆర్డీఓ, మెప్మా అధికారులు మహిళా సంఘాల సమావేశాల్లో వ్యాధులు ప్రబల కుండా తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. గతంలో జ్వరాలు ప్రబలిన ప్రాంతాలను హాట్ స్పాట్ గా గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.  పరీక్షలు నిర్వహిస్తూ వ్యాధులు ప్రబల కుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాలని  తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి డా మధుసూదన్, ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ డా నవీన్, ఆసుపత్రుల సమన్వయ అధికారి డా శ్రీకాంత్, డిపిఓ వీరభద్రయ్య, డిఆర్డీఓ బాలకృష్ణ, బిసి సంక్షేమ అధికారి క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -