మరో ముగ్గురు బాక్సర్లు సైతం
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్స్
లివర్పూల్ (ఇంగ్లాండ్) : వరల్డ్ బాక్సింగ్ (డబ్ల్యూబి) ప్రపంచ చాంపియన్షిప్స్లో భారత యువ బాక్సర్ మీనాక్షి పసిడి పోరుకు చేరుకుంది. మహిళల 48 కేజీల విభాగం సెమీఫైనల్లో మీనాక్షి 5-0తో మంగోలియ బాక్సర్పై ఘన విజయం సాధించింది. మూడు రౌండ్లలో మంగోలియ బాక్సర్పై పిడి గుద్దుల వర్షం కురిపించిన మీనాక్షి.. ఐదుగురు రిఫరీల ఏకగీవ్ర విజేతగా నిలిచింది. మహిళల 80 కేజీల విభాగంలో పూజ రాణి, 80+ కేజీల విభాగంలో నుపుర్, 57 కేజీల విభాగంలో జైస్మిన్లు సైతం సెమీఫైనల్లో సాధికారిక విజయాలు సాధించిన ఫైనల్స్కు చేరుకున్నారు. దీంతో ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్స్లో టీమ్ ఇండియా కనీసం నాలుగు రజత పతకాలు ఖాయం చేసుకుంది.