రాష్ట్ర మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొరిమి సుగుణ
నవతెలంగాణ – భూపాలపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వర్కర్స్ కార్మికులకు నాలుగు నెలల పెండింగ్ కేసులు బిల్లులను వెంటనే చెల్లించాలని రాష్ట్ర మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొరిమి సుగుణ డిమాండ్ చేశారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ (అనుబంధం) ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లా అదన కలెక్టర్ అశోక్ కుమార్,డీఈఓ రాజేందర్ కు వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కొరిమి సుగుణ మాట్లాడుతూ.. జిల్లాలో మధ్యాహ్న భోజన కార్మికులకు నాలుగు నెలలుగా వంట బిల్లులు ఇవ్వలేదని వెంటనే వారికి పెండింగ్ బిల్లులను చెల్లించాలని కోరారు. అట్లాగే కోడిగుడ్లు, అల్పాహార బిల్లులు కూడా పెండింగ్ లో ఉన్నాయని వాటిని కూడా చెల్లించాలన్నారు. రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభమవుతున్న తరుణంలో మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారని, వెంటనే ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న బిల్లులను చెల్లించి మధ్యాహ్నం భోజన కార్మికులను ఆదుకోవాలని కోరారు . ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు, వరలక్ష్మి, ఉమాదేవి, బెల్లంకొండ స్వప్న, సంబడి చంద్రక్క, వేముల రాజేశ్వరి, సమత, సరోజన, కళావతి, మమత, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజన పథకం బిల్లులను వెంటనే చెల్లించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES