- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: శ్రీశైలానికి వెళ్తున్న ఓ మినీ బస్సు నాగర్కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటలో ఈ రోజు ఉదయం బోల్తాపడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన 40 మంది భక్తులు ఓ ప్రయివేటు మినీ బస్సులో శ్రీశైలానికి బయలుదేరారు. దోమలపెంట బస్టాండ్ వద్ద బ్రేకులు ఫెయిల్ కావడంతో వాహనం అదుపుతప్పింది. బస్సును అదుపుచేసే క్రమంలో ఎదురుగా వస్తున్న రెండు కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొందరికి తీవ్ర గాయాలు, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను దోమలపెంట జెన్కో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
- Advertisement -