- Advertisement -
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్: హుస్నాబాద్ మండలంలోని వంగ రామయ్యపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన భూక్య రాజేశ్వరి తిరుపతి, ఉప సర్పంచ్ దుండుగుల రాజు వార్డు మెంబర్ లను బుధవారం మంత్రి కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సన్మానించారు. ఏకగ్రీవంగా సర్పంచ్ , ఉపసర్పంచ్ ను ఎన్నుకున్నందుకు ఆ గ్రామ అభివృద్ధికి ఐక్యంగా పని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఆయనతో పాటు కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు బందేల హరీష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



