Friday, December 5, 2025
E-PAPER
Homeతాజా వార్తలు గ్లోబల్ సమ్మిట్‌కు చంద్రబాబును ఆహ్వానించిన మంత్రి కోమటిరెడ్డి

 గ్లోబల్ సమ్మిట్‌కు చంద్రబాబును ఆహ్వానించిన మంత్రి కోమటిరెడ్డి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’కు హాజరుకావాల్సిందిగా చంద్రబాబును ఆయన ఆహ్వానించారు. శుక్రవారం అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.

డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ వేదికగా ఈ గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ఈ సదస్సును ప్రపంచ ప్రఖ్యాత దావోస్ సదస్సు తరహాలో నిర్వహిస్తున్నామని చంద్రబాబుకు వివరించారు. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా పలు ప్రముఖ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు హాజరవుతున్నారని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం తరఫున అధికారికంగా ఆహ్వానాన్ని అందించిన కోమటిరెడ్డి, సమ్మిట్ ప్రాధాన్యతను ముఖ్యమంత్రికి తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -