- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి అంకితంగా నిర్వహించే లష్కర్ బోనాల జాతర ఈ ఉదయం వేడుకల మధ్య ప్రారంభమైంది. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తన సతీమణితో కలిసి అమ్మవారికి తొలి బోనం సమర్పిస్తూ పూజలు నిర్వహించారు. అందరూ తలచుకునే పవిత్ర ఘట్టానికి హాజరై భక్తిశ్రద్ధలతో మొదటి బోనాన్ని సమర్పించారు. బోనం సమర్పించేందుకు దూరదూరాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రముఖ రాజకీయ నేతలు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీని పరిగణలోకి తీసుకొని భద్రతా ఏర్పాట్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.
- Advertisement -