- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల మాజీ జెడ్పిటిసి కొండ రాజమ్మ భర్త కొండ సమ్మయ్య అనారోగ్యంతో హైదరాబాద్ లోని అమెరికన్ బ్రెయిన్ అండ్ స్పైన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ఐటి, పరిశ్రమల,శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంగళవారం ఆస్పత్రికి వెళ్ళి ఆయన ఆరోగ్య పరిస్థితి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సమ్మయ్యకు అవసరమైన మెరుగైన వైద్యం అందేలా చూడాలని హాస్పిటల్ వైద్యులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -