- Advertisement -
నవతెలంగాణ – ముధోల్ : ముధోల్ మండలానికి చెందిన 13మంది లబ్ధిదారులకు ఆదివారం ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తన నివాసంలో సీఎం సహాయనిధి చెక్కులను పంపిణి చేశారు. గడిచిన 18 నెలల్లో ముధోల్ నియోజకవర్గంలో 3 వేల చెక్కులను అందజేసినట్లు తెలిపారు. తాను ఎమ్మెల్యే అయినప్పటి నుండి ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ తన వంతు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షుడు కోరిపోతున్న,నాయకులు ధర్మపురి సుదర్శన్, తాటివార్ రమేష్, జీవన్, సాయినాథ్ తదితరులున్నారు.
- Advertisement -